Thursday, September 23, 2010

పరిచయం


శ్రీకృష్ణదేవరాయలవారి భువనవిజయమందు గల అష్టదిగ్గజాలలో ఒకరైన తెనాలిరామకృష్ణుడు మధ్యభారత ఇతిహాసం లో తెలుగు జాతి పొందిన మహా ప్రసాదం.
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థానములోని కవీంద్రులు.స్మార్త శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్ర లో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు కలదు. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో కలవు.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చినారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామలింగయ్య తాత,ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. క్రీ.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరు కు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. (పై లైన్లను తెవికీ నుండీ నేరుగా నకలు చేసి అతికించాను ఆ పేజీ యొక్క లింకు)



2 comments:

  1. మీ బ్లాగు బాగుంది రహ్మానుద్దీన్ గారూ. ఇంకా వ్రాస్తూ ఉండండి.

    ReplyDelete
  2. మా ఇంటి పేరు పీసుపాటి, ఆచంట గ్రమస్తులైన మా ముత్తాత గారు ,ఉద్యోగరీత్యా సామర్లకోట లో స్థిరపడి ఆచంట సీతారామయ్య అని పిలిపించుకుని..మా అందరి ఇంటిపేరు మార్చేశారు.

    ReplyDelete